సీనియర్ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సెంట్రల్ ఎడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్ (క్యాట్) లో వేసిన పిటిషన్ పై విచారణ ప్రారంభం అయింది. ఏపీ ప్రభుత్వం తరపున క్యాట్ విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కేసు కోసం నియమించిన సీనియర్ కౌన్సిల్ దేశాయి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.
ప్రకాష్ రెడ్డికి ఈ కేసులో హైకోర్టులో స్పెషల్ కౌన్సిల్ పి గోవిందరెడ్డి, క్యాట్ హైదరాబాద్ బెంచ్ ప్రభుత్వ న్యాయవాది ఎం బాల్ రాజ్ సహకరిస్తారు. డీజీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే హోమ్ శాఖ కి ఇన్ఫార్మ్ చేశారా అని ఈ సందర్భంగా క్యాట్ ప్రశ్నించింది. డీజీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేసారు అని కూడా ప్రశ్నించింది.
అదే విధంగా ఈ ఐపీఎస్ అధికారికి మే 31 2019 నుంచి ఎందుకు జీతం ఇవ్వలేదు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. వీటన్నింటికి సమాధానాలు చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం వారం రోజుల సమయం అడిగింది. దాంతో కేసు విచారణ ఈ నెల 24 కి వాయిదా వేశారు.