37.2 C
Hyderabad
May 6, 2024 14: 02 PM
Slider గుంటూరు

9న నరసరావుపేట లో ఇస్కాన్‌ జగన్నాథ రథోత్సవం

ఈ నెల 9న పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో శ్రీశ్రీ రాధా గోవింద చంద్ర మందిరం(ఇస్కాన్‌) ఆధ్వర్యంలో పట్టణంలో జగన్నాథ రథోత్సవం జరగనుంది. ఈ రథయాత్ర 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని చక్రధారి ప్రభు తెలిపారు. ఇస్కాన్‌ టెంపుల్‌ వద్ధ రథయాత్ర మొదలై సత్తెనపల్లి రోడ్డు, మల్లమ్మ సెంటర్‌, శివుడి బొమ్మ, గడియార స్తంభం, పాత పల్నాడు బస్టాండ్‌ మీదుగా కోమల కన్‌వెన్సన్‌ హాలు వరకు సాగుతుందన్నారు.

అలాగే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు చపన్‌ భోగ(56) నివేదన మరియు జగన్నాథ లీల ప్రవచనం పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు చే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు వివిధ భజన మండల ప్రతినిధులు వారి శిష్య బృందంతో కోలాటము, భజన, గీతాలాపనతో స్వామివారి రథయాత్రలో తప్పనిసరిగా సమయానికి పాల్గొని రథము లాగి తమ భక్తిని చాటుకున్న వలసినదిగా చేగు వెంకటేశ్వరరావు కోరుతున్నారు. మహిళలు తమ బృందం డ్రెస్ కోడ్ చీరలు ధరించి పాల్గొనవలసిందిగా కోరారు. ఇదే ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా పాల్గొని తమ కోరికలు నివేదించు కొని స్వామివారి ఆశీస్సులు పొంద వలసినదిగా కోరారు.

Related posts

కరోనా లెసన్స్: ప్రభుత్వ వైద్యో నారాయణో హరి:

Satyam NEWS

చెత్త రాజకీయాలను చీపురుతో ఊడ్చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ

Satyam NEWS

ఉచితంగా మూడు స‌బ్జెక్ల్ ల‌ కు శిక్ష‌ణ‌….!త్రిశూల్ ర‌మ‌ణా స్కూల్ సంచ‌ల‌న నిర్ణ‌యం….!

Satyam NEWS

Leave a Comment