సముద్రంలో స్నానాలకు దిగి తరచూ ఎవరో ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారిని రక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున అన్నారు. వైజాగ్ సేవ్ సంస్థ దీని కోసం ‘లైఫ్ బోయ్’ రోబో యంత్రాలను తయారు చేసిందన్నారు. పూర్తిగా బోటు మాదిరిగా పనిచేసే రోబో ఏకకాలంలో ముగ్గురిని రక్షిస్తుందన్నారు. తీరం నుంచి 600 మీటర్ల దూరం వరకూ దీనిని పంపించవచ్చునన్నారు. దీని ఖరీదు రూ.5.5 లక్షలు అని సంస్థ తెలిపిందని కలెక్టర్ పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీషా మాట్లాడుతూ దేశంలోనే ఇటువంటి రోబో మొదటిదన్నారు. ప్రభుత్వ అనుమతితో వీటి కొనుగోలుకు ప్రయత్నిస్తామన్నారు.
previous post