ఈ నెల 13న జరిగే హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ పాలక మండలి సభ్యులు, వేద పండితులు గురువారం నిర్మల్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఆశీర్వచనం పలికారు. కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు. 12వ తేదీ సోమవారం సాయంత్రం ఎదుర్కోళ్లు, 13న కల్యాణం, 14న రథోత్సవం జరుగుతాయి.
previous post