28.7 C
Hyderabad
May 6, 2024 10: 37 AM
Slider రంగారెడ్డి

గణనాథుని ఆశీస్సులతో శుభ ఫలితాలు జరగాలి

#bandari

గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరికి శుభ ఫలితాలు జరగాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆకాంక్షించారు. శుక్రవారం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లక్ష్మీనగర్, చైతన్యనగర్, ఇంద్రనగర్, బక్షిగుడ, మంగాపురం, వేంకటేశ్వరనగర్, ఓల్డ్ మీర్పెట్, శాంతినగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథుల మడపాలను ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరకి శుభ ఫలితాలు జరగాలని  ఆకాంక్షించారు. అనంతరం కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

రఘురామ డిమాండ్: వివేకా మర్డర్ కేసులో విజయసాయిని ప్రశ్నించాలి

Satyam NEWS

సత్యం న్యూస్ కథనంతో కదిలిన పోలీసు యంత్రాంగం

Satyam NEWS

పోలీస్ రాజ్: కులం వివరాలు అడిగి అరెస్టు చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment