కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనా ను అరికట్టేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అందచేశారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, జిల్లా అధికారులు చేస్తున్న సేవలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ నిధులను అందించినట్టు ఆయన తెలిపారు.
ఈ నిధులను వైరస్ అడ్డుకునేందుకు వినియోగించాలని కోరారు. ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రభుత్వ అధికారులకు,సిబ్బంది కి సహకరించాలని బండి సంజయ్ విన్నవించారు.