కరీంనగర్ నుండి మానకొండూర్ మీదుగా ఎల్కతుర్తి వరకు రైల్ వే లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు.గతం లోకరీంనగర్ నుండి కాజిపేట్ వరకు కు రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని వాటి స్థానే కరీంనగర్ నుండి మానకొండూర్ మీదుగా ఎల్కతుర్తి వరకు నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనీ కోరారు.
గురువారం ఢిల్లీలో మంత్రిని కల్సిన ఎంపీ ఒక వినతి పత్రాన్ని అందచేశారు. గతం లో ప్రపోసల్ చేసిన లైన్ ను తీరిగి ఏర్పాటు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.కరీంనగర్ నుండి వరంగల్ కు ఈ రైల్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతం గా ఉంటుందన్నారు.అల్లాగే ఈబడ్జెట్ లో కరీంనగర్ మనోహరాబాద్ లైన్ నిర్మాణానికి రూ. 236 కోట్ల నిధుల మంజూరి పై ఆయనకు కృతజ్ఞతలు తెలియ చేశారు.
ఈ నిధుల మంజూరితో ప్రజలకు నిర్మాణం పూర్తవుతుందని నమ్మకం కలిగిందన్నారు.అయన వెంట సుబ్రహ్మణ్యం ఉన్నారు.