చిత్తూరు జిల్లాలోని సదాశివకోన జలపాతానికి విహార యాత్రకు వెళ్లిన ఉద్యోగుల జాడ తెలియ రాలేదు. ఆదివారం విహార యాత్రకు వెళ్లిన ఉద్యోగుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి.
వీరిలో ముగ్గురు నెల్లూరుకు చెందినవారు. బ్యాంకు వద్ద ఉద్యోగుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి ఫోన్లు పనిచేయక పోవడంతో అటవీ ప్రాంతాన్ని పోలీసులు గాలిస్తున్నారు.
చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో పుత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది.