కేసీఆర్ వీరాభిమాన సంఘం హైదరాబాద్ మునిసిపల్ ప్రాంతంలోని అంబర్ పేట్ డివిజన్ మహిళా అధ్యక్షురాలిగా తాడూరి పద్మను ఎంపిక చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బీవీ రమణ ఈ మేరకు ఆమెకు నియామక పత్రం అందచేశారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రమణ అన్నారు.
కోటి ఎకరాలకు సాగునీటి ని అందచేసిన అపర భగీరథుడు ఆయన అని రమణ తెలిపారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ వీరాభిమాని సంఘం గ్రేటర్ హైదరాబాద్ అన్ని ప్రాంతాల లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రమణ తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో 150 స్థానాలకు 150 స్థానాలు గెలుపు దిశగా ప్రయాణిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళానాయకురాళ్లు వనిత, జయ, రాజా లక్ష్మి, పద్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.