42.2 C
Hyderabad
May 3, 2024 17: 21 PM
Slider ప్రపంచం

ఇన్ హ్యూమన్:11 మందిని పాశవికంగా నరికేసిన ఐసిస్

ISISIS

ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఐసిస్ తన వికృత రూపాన్ని మరో సారి ప్రపంచానికి చూపించింది. ఈశాన్య నైజీరీయాలో బందీలుగా ఉన్న 11 మందిని అత్యంత దారుణంగా హతమార్చింది. ఐఎస్‌ అధినేత అబూబాకర్‌ ఆల్‌ బాగ్దాది మరణానికి ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రకటించింది. ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)తో జట్టుకట్టిన నైజీరియా జీహాదీలు ఈశాన్య నైజీరియా నుంచి ఇటీవల పదకొండు మంది క్రిస్టియన్లను బందీలుగా పట్టుకున్నారు.

ఇస్లామిక్‌ స్టేట్‌ పశ్చిమాఫ్రికా ప్రావిన్స్‌ (ఐఎస్‌డబ్ల్యూఏపీ) జీహాదీలు వీరి కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అక్కడ పది మంది తలలు నరికేశారు. మరొకరిని కాల్చిచంపారు. అనంతరం ‘మేము బందీలుగా పట్టుకున్న 11 మందిని చంపేశాం’ అంటూ ఐఎస్‌ ప్రచార విభాగమైన అమక్‌ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

Related posts

బిగ్ న్యూస్: బుల్లితెరపై మళ్లీ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్

Satyam NEWS

విజయనగరం లో ఉట్టిపడిన శ్రీశ్రీ శ్రీ పైడితల్లి ఉత్సవ శోభ

Satyam NEWS

ములుగుకు ఈ నెల 28న రానున్న మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

Leave a Comment