ఈ నెల 28 వ తేదీన ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు, ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్& బి గెస్ట్ హౌస్ సమీపంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ కొరకు శంకుస్థాపన స్థల పరిశీలన చేశారు. అనంతరం బండారుపల్లి రోడ్ తంగడి మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ స్థలిని మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ అలాం, జడ్పీ చైర్ పర్సన్ బడేనాగ జ్యోతి, రైతు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పిటిసి హరిబాబు, డిపిఓ వెంకయ్య, కలెక్టరేట్ ఏ ఓ ప్రసాద్, ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post