ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే ఉద్దేశంతో, 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కాచిగూడ డివిజన్ లోని బర్కత్ పుర హౌసింగ్ బోర్డు కాలనీ పార్కును ఆదివారం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లాంఛనంగా ప్రారంభించారు. పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్, అధికారులు, కాలనీ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1 కోటి 50 లక్షల రూపాయలతో పార్కును అభివృద్ధి చేశారు. ప్రతి అడుగులో శ్రద్ధ – ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అదే విధంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ లోని బురుజు గల్లీలో డ్రైనేజీ మరియు మంచినీటి పైప్ లైన్ పనుల 38 లక్షల రూపాయలతో నూతనంగా వేయనున్న వాటర్ పైప్ లైన్ పనులను అంబర్ పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్, బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డితో కలిసి ప్రారంచారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బిజెపి, టిఆర్ఎస్ నాయకులు, బస్తీవాసులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్