37.2 C
Hyderabad
May 1, 2024 11: 41 AM
Slider గుంటూరు

సైకో పాలన పోతేనే రాష్ట్రం అభివృద్ధి

#tdp

సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, రాష్ట్రంలో జరుగుతున్న ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని 31వ రోజు గణపవరం గ్రామములోని 4వ వార్డు,  పరమేశ్వర క్వారీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు ,తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు క్లస్టర్  యూనిట్ సభ్యులు కలిసి ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి పాలనా లో నిత్యావసర ధరలు తో పాటు విద్యుత్ చార్జీలు పెంచడమే కాకుండా చెత్తపై పన్ను. .బాత్రూమ్ పై పన్నులు అని దోపిడీ దొంగల మాదిరిగా జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వివరించి, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జి లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంక్రాంతి శోభ

Satyam NEWS

సామాన్యులే కాదు… బీఎస్ఎఫ్ ఉద్యోగులు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నారు…!

Satyam NEWS

ఎన్టీఆర్ పేరు తొలగించటంపై నందమూరి రామకృష్ణ నిరసన

Satyam NEWS

Leave a Comment