దేశ రాజదాని నడిబొడ్డులో అంగరంగా వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయ బతుకమ్మ వేడుకలలో దేశ నలుమూలలా నుండి వచ్చిన మహిళలు పాల్గొన్నారు.
ఇండియా గెట్ వద్ద కర్తవ్య పథ్ లో జరిగిన ఈ బతుకమ్మ వేడుకల్లో దేశవ్యాప్తంగా బతుకమ్మ ప్రాముఖ్యత తెలిసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆడపడుచులు ఆటపాటలతో అలరించారు. తెలంగాణ అడపడుచులతో కలసి మంత్రి కిషన్ రెడ్డి, ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో బిజెపి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డా.ఎన్.గౌతమ్ రావు, శ్యామ్ సుందర్ గౌడ్, బిజెపి మహిళ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట