ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు లిఖితపూర్వక ఆదేశాలిచ్చింది.
- స్టే విధించిన చోట్ల ఆరు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
- సాక్షులకు భద్రత కల్పించే అంశంలో ట్రయల్ కోర్టులే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
★ ప్రజాప్రతినిధుల కేసులపై స్టే విధించిన చోట్ల ఆరు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
★ ఆ తర్వాత స్టే చెల్లుబాటు కాదన్న ఆదేశాలను అన్నికోర్టులూ పాటించాలంటూ.. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
★ కేసుల విచారణలో అనవసర వాయిదాలు నిరోధించాలని సూచించింది.
★ సాక్షుల రక్షణ పథకం-2018ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని.. సాక్షుల భద్రతాంశాలపై ట్రయల్ కోర్టులే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
★ దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం విధించాలన్న మధ్యంతర అప్లికేషన్పై అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రానికి మరో వారం గడువు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.
★ ఈ అంశంపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.
ఖర్చులపైనా..
★ న్యాయస్థానాలు జారీ చేసే వారెంట్ల అమలు, సమన్ల అందజేతకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారుల నియామకం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
★ కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోని పెండింగ్ కేసుల వివరాలు తదుపరి విచారణ తేదీ నాటికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
★ దేశవ్యాప్తంగా ప్రతిజిల్లా కోర్టులో ఒక వీడియో కాన్ఫరెన్స్ గది ఏర్పాటుకు అయ్యే ఖర్చు భరించే అంశంపై.. కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.