Slider మహబూబ్ నగర్

బీసీల సభలో మంత్రి, సీఐపై విమర్శలు

#wanaparthy

వనపర్తిలో బీసీల సభలో మంత్రి నిరంజన్ రెడ్డి, కొత్తకోట  పోలీస్ సీఐ శ్రీనివాస్ రెడ్డిపై వక్తలు విమర్శలు చేశారు. గతంలో వున్న MLA లు చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అభివృద్ధి కోసం పోటీ పడ్డారని కాని నేడు వనపర్తిలో అవినీతి ఉందని, బీసీలపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. కొత్తకోట సీఐ తమను చిత్ర హింసలు పెట్టారని భాధితుడు శివ యాదవ్ చెప్పారు. మంత్రి నిరంజన్ రెడ్డికి భయపడే ప్రసక్తి లేదని రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు. దేవాలయం భూములు, అవినీతి చిట్టా బయట పెడతామని తెలిపారు. బి.సి ఆత్మగౌరవసభకు వచ్చిన ఎం.ఎల్.ఎ ఈటల రాజేందర్ ను సన్మానించారు. తెలుగుదేశం మాజీ Z.P.T.C వెంకటయ్య యాదవ్, నందిమల్ల అశోక్ టి.డి.పి అధ్యక్షుడు పాల్గొన్నారు. పోలీస్ కేసులకు భయపడకుండా పోరాటం చేస్తామని నేతలు చెప్పారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

Satyam NEWS

గోల్నాక డివిజన్ లో కొత్త డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శ్రీకారం

Satyam NEWS

జర్నలిస్టు కుటుంబాల సంక్షేమం కోసం నాయకుల సహకారం

Satyam NEWS

Leave a Comment