జర్నలిస్టు కుటుంబాల హెల్త్ ఇన్సూరెన్స్, సంక్షేమం కోసం ఏర్పాటు చేయనున్న కార్పస్ ఫండ్ విషయంలో ప్రజాప్రతినిధులు నాయకులు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించడం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
చర్లపల్లి పారిశ్రామిక వాడలోని సిఐఏ భవనంలో బుధవారం జరిగిన కాప్రా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు.
ముందుగా కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి వర్గం సభ్యులు శనిగరం అశోక్ గడ్డమీద బాలరాజ్ లకిడి బాల్రెడ్డి పవన్ ఫిరోజ్ ఆంజనేయులు సాంబశివుడు నరసింహ కిరణ్ సత్యనారాయణ తదితరులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కార్పొరేటర్లు నాయకులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం రాజీలేని కృషిని కొనసాగిస్తుందన్నారు.
సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తున్న జర్నలిస్టులకు నాయకులంతా అండగా నిలబడేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, మీర్పేట్ హౌసింగ్ బోర్డ్, మల్లాపూర్, నాచారం కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జెన్ శేఖర్, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్ అద్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్,మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, కొత్త రామారావు, పావని మణిపాల్ రెడ్డి చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS ప్రతినిధులు జర్నలిస్టులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.