39.2 C
Hyderabad
May 4, 2024 19: 41 PM
Slider విశాఖపట్నం

బిసిలను ముట్టుకుంటే మసి అయిపోతావు జగన్ రెడ్డీ

ayynnapatrudu

ఎన్నికల్లో మద్యం, డబ్బు వినియోగించకూడదని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ ఎన్నికలో దిమ్మ దిరిగే దెబ్బ కొట్టాలి. అప్పుడు జగన్ వళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకుంటాడని ఆయన అన్నారు. బిసి లను ముట్టుకుంటే మసి అయిపోతావు, బి సి ల జోలికి వెళ్లవద్దు జగన్ మోహన్ రెడ్డి అంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రంగా హెచ్చరించారు.

బీసీ లకు నష్టం జరుగుతుంతే ఎన్నికల సంఘం ఎలా చూస్తూ ఉరుకుంటోందని ఆయన ప్రశ్నించారు. ఒక్క విశాఖ జిల్లాలో 652 ఎంపీటీసీ లు ఉంటే 173 సీట్లు మాత్రమే బీసీ లకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. 34 శాతం నుంచి 27 శాతం తగ్గించడం వల్ల  స్థానిక సంస్థల ఎన్నికలో 16000 మంది బిసిలకు నష్టం జరుగుతోంది అని ఆయన అన్నారు.

Related posts

కందుకూరు తొక్కిసలాట మృతులకు ప్రధాని సంతాపం

Bhavani

భూతద్ధం భాస్కర్‌ నారాయణగా శివ కందుకూరి నటించిన సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌

Satyam NEWS

వనపర్తి జిల్లాలో సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు

Satyam NEWS

Leave a Comment