ఆంధ్ర-తెలంగాణ జిల్లాలకు వారధిగా నిలిచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద కృష్ణవేణి చెంత ప్రశాంత వాతావరణంలో వెలిసిన సాగరమాత మహోత్సవాలు అత్యంత వైభవంగా శనివారం ప్రారంభమ య్యాయి. ప్రకాశం, కృష్ణా, నల్గొండ రంగారెడ్డి, హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలకు నుంచి భక్తులు భారీగా వస్తున్నారు.
గతతేడాది 3 లక్షల మంది సాగరమాత ఉత్సవాలకు హాజరుకాగా ఈ సంవత్సరం అంతకుమించి భక్తులు రావచ్చనే అంచనాలతో సదుపాయాలు కల్పిస్తున్నట్లు సాగరమాత విచారణ గురువు హృదయ కుమార్ తెలిపారు. 9వ తేదీ న పీఠాధిపతులు గుంటూరు పీఠాధిపతులు డా. సిహెచ్ భాగ్యయ్య హాజరుకానున్నారు. దివ్యబలి పూజ, స్తుతి ఆరాధనలు, స్వస్థత ప్రార్ధనలు, జపమాల, తేరు ప్రదక్షిణ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
సాగర మాత ఉత్సవాల సందర్భంగా మాచర్ల గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వి.పి.సౌత్ ఎస్సై రవీందర్ పర్యవేక్షిస్తున్నారు. సుమారు 60 మంది పోలీసులు ఉత్సవాల్లో పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు