38.2 C
Hyderabad
April 29, 2024 14: 46 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు

#PangalMandal

వనపర్తి జిల్లా పాన్ గల్ మండలంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు. మండల కేంద్రం లో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న తరుణంలో ఎంపీపీ మావిల్లపల్లి  శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధికారులు సర్పంచ్ సింగిరెడ్డి గోపాల్ రెడ్డి ల తో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల కేంద్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గం. నుండి మధ్యాహ్నం 12  వరకు నిత్యావసర వస్తువులు తప్ప  హోటళ్ళు ఇతర షాపులు తెరవరాదని నిర్ణయించారు.

ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటిస్తూ అత్యవసర  సమయంలోనే బయటకు రావాలని  ఎక్కడ కూడా గుంపులుగా కనిపించ రాదని ఈనెల 28 నుండి వచ్చే నెల 12వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు.

నిర్ణయించిన ప్రకారం తప్ప ఇతర సమయాలలో షాపులు తెరిస్తే వెయ్యి రూపాయలు జరిమానా తప్పదని అన్నారు మాస్కులు ధరించ కుంటే కూడా జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.

Related posts

కొట్టుకు చస్తున్న మూవీ ఆర్టిస్ట్‌ (మా) లు

Satyam NEWS

గ్రామాల అభివృద్ధికి సాయం అందిస్తాం

Bhavani

పెద్ద ఆఫర్ ను వదులుకున్న దిల్ రాజు

Satyam NEWS

Leave a Comment