విశాఖలో మకర సంక్రాంతి ఉత్తమ సేవా అవార్డ్స్ ప్రదానం చేశారు. ఇందులో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును మల్ల కోటేశ్వరరావు అందుకున్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో చెన్నారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జోనల్ కమిషనర్ కృష్ణ, చారిటబుల్ ట్రస్ట్ సంఘ సభ్యులు, సేవా సంస్థ నాయకులు, విశాఖ లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు విశాఖ తెలంగాణలో స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పెద్దగా పాల్గొన్నారు.
కథనాలకు ఉత్తమ సీనియర్ జర్నలిస్టు అవార్డు న్యూస్ త్రిబుల్ త్రిఎడిటర్ మల్ల కోటేశ్వరావుకి అందించారు. ప్రజా సమస్యలను తమ సమస్యగా భావించి ప్రజా ప్రయోజనం కోసం అనునిత్యం వార్తా కథనాలు అందిస్తున్న న్యూస్ త్రిబుల్ త్రి కి ఉత్తమ జర్నలిస్టుగా ఆయనను కొనియాడారు. ఇటువంటి వారికి సన్మానం చేయడం ఎంతో గర్వంగా ఉందని సంస్థ చైర్మన్ చిన్నారావు తెలిపారు. తమ సంస్థలో ప్రజా సమస్యలను ప్రజా సేవను చేసేవారికి ఈ అవార్డు ప్రదానం చేస్తామని ప్రధానంగా విశాఖ కేజీహెచ్ లో ఒక ఆరోగ్య దగ్గర 300 రూపాయలు తీసుకున్న కథనానికి ఎంతగానో చలించామని
అన్నారు. ఈ కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిపై తగు చర్యలు తనిఖీలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని ఇటువంటి కథనాలు అందిస్తున్న న్యూస్ త్రిబుల్ త్రి రాబోయే కాలంలో మరిన్ని ప్రజాప్రయోజన కథనాలు అందించాలని మనసారా కోరుకున్నారు.