74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబర్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తా, ఎంసిహెచ్ కాలనీ,ఆజాద్ నగర్ లో అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు.
అనంతరం కార్పొరేటర్ డివిజన్ నాయకులతో కలిసి అంబర్ పేట డివిజన్ లోని పలు కాలనీలలో బస్తిలలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌబ్రాతృత్వాన్ని అందించిన మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, నేటి యువత త్యాగధ్వనుల ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థ నాయకులు, కుల సంఘాల నాయకులు, స్థానిక బస్తీ కమిటీ పెద్దలు, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంస్థ సభ్యులు మహిళా నాయకులు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట