ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు కామారెడ్డి జిల్లాలో వాజిద్ నగర్ కు దక్కింది. 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ చేతుల మీదుగా సర్పంచ్ తోట అనూహ్య లక్ష్మీనారాయణ అందుకున్నారు. ఆమె వెంట ఎంపీపీ అశోక్ పటేల్ ఎంపీడీవో ఆనంద్ ఎంపిటిసి బండ కింది సాయిలు ఉప సర్పంచ్ బద్రి సాయిలు ఉన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, నర్సరీ గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులు 1800 వందల మీటర్ల వరకు 15 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో మురికి కాలువ నిర్మాణం, హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ప్రత్యేక శ్రద్ధ వహించి సంరక్షించడం, వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపట్టి ఉత్తమ గ్రామ పంచాయతీగా వాజిద్ నగర్ నిలిచింది.