29.7 C
Hyderabad
May 4, 2024 05: 04 AM
Slider ముఖ్యంశాలు

స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరోనా వీరులకు ఉత్తమ సేవా పురస్కారాలు

#corona

స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు శనివారం వివిధ సామాజిక సేవా రంగాలలో అంకితభావంతో విధులు నిర్వహించి, కర్తవ్య నిర్వహణలో అత్యుత్తమ  సేవలందించి నందుకు గాను ఉత్తమ సేవా పురస్కారంతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు,ఆశ వర్కర్లు,సామాజిక కార్యకర్తలకు,కళాకారులకు విశిష్ట సేవలందించి, ప్రజాభిమానం చూరగొన్న స్పూర్తిదాయకమైన వారి వ్యక్తిత్వమును కొనియాడుతూ ఆగష్టు15 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకోని ప్రశంసా పత్రం అందజేసి అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా కరోనా విలయతాండవ సమయంలో కరోనా వైరస్ సోకి  మరణించిన వారికి సొంత కుటుంబ సభ్యులే అంతిమ సంస్కారాలు చేయలేని దయనీయ పరిస్థితిలో అన్నీ తామై ధైర్య సాహాసాలతో వారి అంతిమ సంస్కారాలు నిర్వహించి సేవలందించిన షేక్ జహంగీర్, బల్వంత్ సింగ్,నసీర్ లకు ఉత్తమ సేవా పురస్కారాలను ఇచ్చి శాలువలతో సత్కరించారు.కరోనా విధి నిర్వహణలో సేవలందించినందుకు ఈ పురస్కారానికి వారు ఎంపిక అయినట్లు ఆర్గనైజేషన్ నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు,ఆశ వర్కర్లు, సామాజిక కార్యకర్తలు,కళాకారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు కరోనా కేసులు

Satyam NEWS

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కేసీఆర్ సర్కార్ పై చర్యలు

Satyam NEWS

హిందూ యువతులను అంతం చేసే “రాక్షస క్రీడా లవ్ జిహాద్”

Bhavani

Leave a Comment