కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన ఒక రైతుకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని అతను హైదరాబాద్ యశోదా లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు నాగర్ కర్నూల్ డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు. తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామ పరిధిలోని ఆర్సి తండాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇతడు భూత్పూర్ ఎస్బిఐ బ్యాంకు లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్నాడు అని ఆయన తెలిపారు ఇద్దరూ వ్యక్తులకు సంబందించి ప్రైమరి కాంటాక్ట్ లను గుర్తిస్తున్నట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు.