పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న గిరిజన రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బిజెపి నాయకులు ప్రకటించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బిజెపి నాయకుడు గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు,అడ్వకేట్ బాలాజీ పవార్ మాట్లాడుతూ గుర్రంపోడులో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులు 60 రోజులు జైలు జీవితం గడిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గుర్రంపోడులో జరిగిన భూ కబ్జాలపై తక్షణమే ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన కోరారు. బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రైతులపై, బిజెపి నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతం బిజెపి రాష్ట్ర నాయకులు బాలాజీ నాయక్ మేళ్ళచెరువు మండల మహిళా నాయకురాలు పద్మారెడ్డి ని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఎస్టి మోర్చ అధ్యక్షుడు బాల్సన్ నాయక్, సీనియర్ నాయకులు ఉమామహేశ్వర రావు,హుజూర్ నగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇంటి రవి,శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బాలాజీ నాయక్ కూడా పాల్గొన్నారు.