29.7 C
Hyderabad
May 7, 2024 03: 32 AM
Slider రంగారెడ్డి

దేశం కోసం ఉరికంబం ముద్దాడిన గొప్ప వీరుడు భగత్ సింగ్

#bhagatsinghuppal

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్  చర్లపల్లి డివిజన్ లో భగత్ సింగ్ 114 వ జయంతి వేడకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ అధ్యక్షుడు గడ్డం యాదగిరి  ఆధ్వర్యంలో  భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా  గడ్డం యాదగిరి మాట్లాడుతూ దేశం కోసం ఉరికంబం ముద్దాడిన గొప్ప పోరాట వీరుడు భగత్ సింగ్  అని  అన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. 

నేటి తరం యువత భగత్ సింగ్ స్పూర్తితో  ఉద్యోగ ఉపాధి అవకాశాలపై పోరాటాలకు  సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి  ముస్తాక్, కడియాల యాదగిరి, ఆనంద్ గౌడ్, లక్ష్మణ్, లచ్చయ్య, తుమ్మల కృష్ణ, శంకర్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు

Related posts

TPCC ఆర్గనైజింగ్ సెక్రటరీగా Sk బషీర్ నియామకం

Satyam NEWS

జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్

Satyam NEWS

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇజ్రాయెల్ లో ప్రయత్నాలు

Bhavani

Leave a Comment