కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివరాలు చూస్తే.. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8, అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13, అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగ నున్నది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నిర్వహించనున్నారు.
కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, వైసీపీ అభ్యర్థి గా డాక్టర్ దాసరి సుధ పోటీ పడనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకు అనుకూలంగా వుండే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన నవరత్నాల అమలు తో గెలుపు తమదే వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.