వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ సోమవారం ముషీరాబాద్ రాంనగర్ చౌరస్తాలో భజరంగ్ దళ్, బిజెపి, విహెచ్ పి తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమని బిజెపి నాయకులు సుమంత్, బీజేవైఎం నగర ప్రధాన కార్యదర్శి మద్దూరి శివాజీ, దీక్షిత్, రవి, నిఖిల్ సింగ్ లు ఆరోపించారు.
ఎంతో ప్రశాంతంగా కోవిడ్- 19 నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తామని హైదరాబాద్ భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి హామీ ఇచ్చినప్పటికీ పోలీసులు అనుమతించక పోవడం దారుణమన్నారు.