సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మిర్యాలగూడెం రోడ్డులో ఏర్పాటు చేసిన బయో డీజిల్ స్టాక్ పాయింట్ ను మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోతి సంపత్ రెడ్డి ప్రారంభించారు. హుజూర్ నగర్ నుండి మిర్యాలగూడ వెళ్లే ప్రధాన రహదారిలో బయో డీజిల్ యూనిట్ నిర్వాహకులతో కలిసి కోతి సంపత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం సంపత్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ రక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు బయో డీజిల్ ని ఉపయోగించాలని, అంతే కాకుండా వాహనదారులకు లీటరుకు ఐదు రూపాయలు తక్కువ ఉండటం వలన కొంత వరకు ఉపశమనం కలుగుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా మన పట్టణాన్నికాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కేవీ ప్రతాప్, వైస్ ప్రెసిడెంట్ రామిశెట్టి రాము, లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ శివరామరాజు, హరికృష్ణ రెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.