వివిధ ఆసుపత్రిలో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకుని మంజూరైన 118 సీఎంఆర్ఎఫ్ చెక్కులకు గాను రూ. 52.28 లక్షల విలువైన చెక్కులను గురువారం వీడీవో క్యాంప్ కార్యాలయంలో ఆయా లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. 116-సీఎంఆర్ఎఫ్ చెక్కులను గాను రూ.48.78 లక్షలు, ఎల్ఓసీ(చికిత్సకు ముందస్తు చెక్కు)-2 ద్వారా రూ.3.50 లక్షలు, మొత్తం రూ.52.28 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఎన్నడూ లేని విధంగా నేటి వరకు రూ.4.21 కోట్ల విలువైన చెక్కులు అందజేశామని పువ్వాడ పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల పాలిట ప్రాణదాతగా నిలుస్తోందని దీన్నిఖమ్మం జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.