తెలంగాణ ఉద్యమకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవీ యాదవ్ అన్నారు.డివిజన్ పరిధిలోని శుభోదయ నగర్ కి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు జంగయ్యకు కాలుకు శస్త్ర చికిత్స జరిగింది.
విషయం తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి,ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్య క్రమంలో నాగిళ్ళ బాల్ రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాలని వాసులు నాయకులు, కార్యకర్తలు కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్