బిజేపి మేడ్చల్ కేపీహెచ్ బీ డివిజన్ 114 బిజెపి అధ్యక్షుడు పిడికిటి గోపాల్ చౌదరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ 49వ జన్మదినాన్ని నిర్వహించారు. KPHB 114 డివిజన్ బిజెపి పార్టీ ఆఫీసులో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్యహరీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేకును కట్ చేసి బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం మాట్లాడుతూ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ గా రాష్ట్ర అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు.
ఈ రోజున తెలంగాణ రాష్ట్ర పార్టీకి సారధ్యం వహిస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతున్నారని, వారి నాయకత్వంలో పని చేయటం చాలా సంతోషంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రీతం రెడ్డి, రాష్ట్ర నాయకులు వల్లభనేని హిమవంతు, కే పి హెచ్ బి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎమ్ నాగలక్ష్మి, జనరల్ సెక్రెటరీ ఎస్ రేవతి పాల్గొన్నారు.
ఇంకా, జనరల్ సెక్రటరీ తేజ రెడ్డి, medowland గురు ప్రసాద్, మగ్దూం , కామేశ్వర రావు, హరిబాబు, M శంకర్, ఏరువ శ్రీనివాస్ రెడ్డి, జి వెంకటేశ్వర్ రావు, S విజయ్, దేవ సహాయం( చిన్న) మతుకుమల్లి ప్రభాకరరావు, బిజెపి మహిళా నాయకురాలు సుగుణ, M వరలక్ష్మి, రేవతి,భాగ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.