డాక్టర్ ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని రాధిక చౌరస్తా లో ఏర్పాటు చేసిన బిస్కెట్ సెంటర్ ను ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బిస్కెట్ సెంటర్ స్థాపకులు నందకిషోర్ ను అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రుచికరమైన పదార్థాలతో కస్టమర్లను ఆకర్షించడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చని అన్నారు. నాణ్యతను పాటిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మణిపాల్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి,, బేతాళ బాలరాజు, కాసంమహిపాల్ రెడ్డి, సురేందర్ రావు, కుమారస్వామి, ఏనుగు సీతారాం రెడ్డి, బాల్ నర్సింహ, గరిక సుధాకర్, కందాడి సుదర్శన్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.