మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తో ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్, నిర్మాత అట్లూరి నారాయణ రావు తాడికొండ సాయి కృష్ణ భేటి అయ్యారు.
గొల్లపూడి లోని ఉమామహేశ్వరరావు నివాసంలో ఆయన్ను కలిశారు. వారు మాట్లాడుతూ ప్రజల మనిషి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో వారి సమస్యలు పరిష్కారిస్తూ వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి అని అన్నారు.
ప్రజల కోసం పనిచేసే వారికి ప్రజా మద్దతు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.