బాగ్ అంబర్ పేట డివిజన్ న్యూ వినాయక్ నగర్ చౌరస్తా నుండి న్యూ వినాయక్ నగర్, మల్లికార్జున్ నగర్, రామకృష్ణ నగర్ బస్తీలలో భారతీయ జనతా పార్టీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తోందని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ డబుల్ బెడ్రూం ఇల్లు తెర పైకి తీసుకు వస్తుందని తెలిపారు. ఈ కాకమ్మ కథలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వర్షాలకు వరద వచ్చిన ప్రాంతాల్లో ఇప్పటివరకు వరద సహాయం అందలేదని, టిఆర్ఎస్ కార్యకర్తలు వారికి నచ్చిన వారికి అందించారని ఆరోపించారు. అసలు అందాల్సిన వాళ్లకు అందలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ గౌడ్, సాంబశివ గౌడ్, పచ్చని రమేష్, జి మల్లేష్, అజయ్ కుమార్, కే. చంద్రశేఖర్, బాల్రాజ్, కోడూరు సురేష్, వెంకటేష్, రమేష్, శ్రీహరి, రఘునందన్, శ్రీనివాస్ గౌడ్, సంజీవ్ కుమార్ చౌదరి, ఈ బాలకృష్ణ, బాలకృష్ణ గౌడ్, కౌశిక్ గౌడ్, పృథ్వీ గౌడ్, శ్రీనివాస్, రవికాంత్, కవిత, వరలక్ష్మి ఇంకా అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.