34.7 C
Hyderabad
May 4, 2024 23: 16 PM
Slider నిజామాబాద్

రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారు…!

#arvinddharmapuri

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ స‌ర్కార్ పై ప్ర‌తిపక్ష పార్టీ బీజేపీ… ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌టం లేదు. తాజాగా ఈ నెల‌లో ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందు గ‌వ‌ర్న‌ర్ త‌మ‌ళిసైతో ప్రారంభించాల్సిందిపోయి…గ‌వ‌ర్న‌ర్ లేకుండా స‌మావేశాలు షురూ చేస్తున్నారు.ఈ విష‌యంపైనే  బీజేపీ కారాలు మిరియాలు నూరుతోంది.ఈ మేర‌కు బీజేపీ నేత‌…నిజాబాబాద్ ఎంపీ  ధ‌ర్మ‌పురి  అర‌వంద్..ఓ సంచ‌ల‌నమైన కామెంట్ చేసారు.

కేసీఆర్….రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ కు అహంకారం మితిమీరి పోయిందని…ఆయనకు మహిళలపై ఉన్న చిన్నచూపును చివరికి రాష్ట్ర ప్రథమ మహిళ అయిన గౌరవ గవర్నర్ డా.తమిళసై పై కూడా చూపించుకున్నారన్నారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని రాజ్యాంగం ప్రకారమే మనమందరం నడుచుకోవాల్సి ఉంటుంద‌ని…కాని ఈ సీఎం సారు… సొంతంగా రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారని ఎంపీ అర‌వింద్ అన్నారు.

తొలి సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంట‌నే ఈ కేసీఆర్ సీఎం అయ్యాక తన క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదని…ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరు నెలల పాటు క్యాబినెట్ విస్తరణే చేయలేదని…బడ్జెట్ ను క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి, బడ్జెట్ సమావేశాల ముందు క్యాబినెట్ ను విస్తరించారని అన్నారు.చట్ట సభల నిర్వహణకు ప్రత్యేక రూల్స్ ఉంటాయని…. వాటన్నింటినీ కేసీఆర్ తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని…. గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే  9 వ అసెంబ్లీ  స‌మావేశాల‌ను ప్రారంభిస్తున్నారన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతనే కొత్త బడ్జెట్ సంవత్సరంలో సెషన్స్ ప్రారంభం కావాలని..కానీ కాని ఈ చంద్రశేఖర రావు రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నాడు కాబట్టి ఈ రూల్స్ ఏవీ ఆయన పాటించడం లేదని ధ్వ‌జ‌మెత్తారు.తాను ఒక రాజును, తెలంగాణ ఒక రాజ్యం అనుకుంటున్నాడని…. అందుకే తాను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు ఫాలో కావాలి…తానే ప్రత్యేక రాజ్యాంగం రాసుకుంటాన‌ని అంటున్నార‌ని ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ అన్నారు.

రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న గౌరవ గవర్నర్ గారినే గుర్తించనప్పుడు, ఈ  సీఎంకు ఆ సీటులో ఒక్క నిమిషం కూడా కూర్చునే అర్హత లేదని…కేసీఆర్ అహంకానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని…. త్వరలో ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమ‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ జోస్యం చెప్పారు.

Related posts

గిరిజనుల నుంచి నిత్యావసరాలు దోచేస్తున్న మావోలు

Satyam NEWS

తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం కరోనా వైరస్ కన్నా ప్రమాదం

Satyam NEWS

మాయ మాటలు చెబుతున్న నిజామాబాద్ ఎంపి

Satyam NEWS

Leave a Comment