ప్రతి ఏటా మార్చి 1వ తేదీన నిర్వహించే మాదిగ అమర వీరుల దినోత్సవం హైదరాబాద్ అంబర్ పేట్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జోహార్ మాదిగ అమర వీరులకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు మిన్నంటాయి. మీ త్యాగం వృధా కానివ్వం సాధిస్తాం మీ ఆశయాలను అంటూ సభలో నినాదాలు చేశారు. ఏబీసిడీ వర్గీకరణను సాదిస్తామని వక్తలు అన్నారు. మంద కృష్ణ మాదిగ అదేశాల మేరకు అంబర్ పేట నియోజకవర్గములో మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ రమేష్ మాదిగ, పల్లె జంగయ్య, వంగురి ఈశ్వరయ్, శ్రీహరి, రంగుల వేణు, పల్లె రాజు, సంపత్, ప్రవీణ్, తదితరులు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అంబర్ పేట నియోజకవర్గం బడుగుల బాలకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట