27.7 C
Hyderabad
May 4, 2024 07: 39 AM
Slider నిజామాబాద్

రామరాజ్యం కావాలా..? రాక్షస రాజ్యం కావాలా..?

#purushottamrupala

రామరాజ్యం కావాలో.. రాక్షస రాజ్యం కావాలో కామారెడ్డి ప్రజలే నిర్ణయించుకోవాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. బుధవారం కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్డీఓ కార్యాలయం వద్దకు వచ్చిన కేంద్ర మంత్రికి బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అక్కడినుంచి ర్యాలీగా బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు.

జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ.. కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించేది, తెలంగాణలో బిసి సీఎంను చేసేది తామేనన్నారు. మేమెంతో మాకంత అనే బిసి నినాదం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల గోసకు కారణమైన కెసిఆర్ ను ఓడించే సదావకాశాన్ని కామారెడ్డి యువత ఉపయోగించుకోవాలన్నారు. సీఎంగా ఉండి మంత్రులకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వని కేసీఆర్ కావాలో, కామారెడ్డిలో ఉండి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే రమణారెడ్డి కావాలో కామారెడ్డి ప్రజలు తేల్చుకోవాలన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ బీజేపీ నినాదమని తెలిపారు. రైతు సంక్షేమం కోసం బీజేపీ చూస్తే, రైతుల భూములు కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ చూస్తుందన్నారు. కామారెడ్డి భూములు కాపాడుకోవాల్సిన బాద్యత ఓటర్ల పైనే ఉందన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

టీఆర్ఎస్ పక్కలో డైనమైట్ వచ్చి చేరింది

Satyam NEWS

వేంగి రాజుల కాలం నాటి చెరువును మాయం చేసిన పెద్దలు

Bhavani

ఉప్పల్‌లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ: నేర్ధం భాస్కర్‌గౌడ్‌

Satyam NEWS

Leave a Comment