మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ కేంద్రంలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో బాగంగా ఎంపి సంతోష్ ఆదేశాల మేరకు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలనే సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నేర్దం భాస్కర్గౌడ్ సిడి గణేశా మట్టి విగ్రహాలను ఉప్పల్ సర్కిల్లో ఉచితంగా పంచడం జరిగింది. ఈ సందర్బంగా నేర్దం భాస్కర్గౌడ్ మాట్లాడతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలను పెట్టి గణపతిని పూజించాలని కోరారు. కరోనా నియమ నిభందనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో ,ఆయురారోగ్యాలతో ,పాడిపంటలతో ప్రజలు ఆనందంగా ఉండాలని అన్నారు.
previous post
next post