పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం కక్కిరేని చేతన హరీష్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి అయిన శుభ సందర్భంగా కార్పొరేటర్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎల్లవేళల పరిష్కరిస్తూ అధికారులతో, ప్రజలతో మమేకమై పార్టీ పిలుపు మేరకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాక్షించారు. పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షుడు కక్కిరేణి హరీష్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ ప్రతినిధి