అత్యంత వైభవంగా జరగబోతున్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటి నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. మేడారం లోని వనదేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ 8వ వార్డు కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతిరెడ్డి కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ లకు బెల్లం మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మలను కోరుకున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. వనదేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు అందరిని చల్లగా చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. సత్యం న్యూస్ మేడ్చల్
previous post