కరోనా కేసుల కట్టడిలో ఇంతకాలం ముందుండి పని చేసిన పోలీసు శాఖ కు ఇప్పుడు కరోనా వైరస్ పట్టుకున్నది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా ఇవాళ ఆ సంఖ్య 15 మందికి చేరింది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకింది.
అదే విధంగా ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో నలుగురికి కరోనా నిర్ధారణ అయింది. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డుకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని చికిత్స నిమిత్తం నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు.