37.7 C
Hyderabad
May 4, 2024 13: 19 PM
Slider ప్రత్యేకం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

#bandisainjaibjp

ఈ నెల 17 తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ…  సీఎం కేసీఆర్ కు  5 పేజీల బహిరంగ లేఖను రాసారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు   బండి సంజయ్ కుమార్. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్ర‌జ‌ల‌న కోరారు… బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్.

తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి, కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సహాయంతో వాటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసారు. తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన 2022 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.

తెలంగాణ విమోచన ఉద్యమం సందర్భంగా రజాకార్ల చేతిలో బలైన వారి కుటుంబాలను అధికారికంగా ప్రభుత్వం సన్మానం చేయాలి, వారిని ఆదుకోవాలని  బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేసారు. అలాగే తెలంగాణ విమోచన పోరాట చరిత్రను, ఆ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల‌న్నారు.  ప్రతి ఏడాది ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని సత్కరించాలని డిమాండ్ చేసారు.

ఇక  రజాకార్లను తరిమి కొట్టిన వీరబైరాన్‌పల్లి, వరంగల్ కోట, రేణికుంట, కడవెండి, కామారెడ్డిగూడెం, పర్కాల, సూర్యాపేట, బీబీ నగర్, బాలెంల – పెరుమాండ్ల సంకీస తదితర ప్రాంతాలతో పాటు, తెలంగాణ విమోచనోద్యమ ఘట్టాలను పరిరక్షించాల‌ని కోరుతూ దాదాపు 5 పేజీల బ‌హిరంగ లేఖను సీఎం కేసీఆర్ ప్రజా సంగ్రామ యాత్ర‌లో భాగంగా బండి సంజ‌య్ కుమార్ రాసారు.

Related posts

సర్టిఫికెట్: ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ

Satyam NEWS

సీట్లు మార్చినా నీకు ఓట్లే రావు జగన్

Satyam NEWS

జోర్డాన్ పార్లమెంట్‌లో ఎంపీల రచ్చ

Sub Editor

Leave a Comment