దేశ వ్యాప్తంగా ఈ నెల 27 భారత్ బంద్ కు కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన నేపద్యంలో వామపక్ష పార్టీలు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలియ చేసారు.
అందులో బాగంగా సీపీఎం కూడా తన మద్దతును ప్రకటించింది. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రుంలోని లావు గంగాదర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ,నగర అధ్యక్షుడు రెడ్డి శంకరరావులు మాట్లాడారు.
మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గే…రైతు కు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చిందన్నారు…సీపీఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ గడచిన 9 నెలల నుంచీ ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తున్నా మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని విమర్శించారు.
సహనం నశించే కిశాన్ మోర్చా..ఈ నెల 27 భారత్ బంద్ నకు పిలుపు నిచ్చిందన్నారు. ఈ బంద్ కు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటుందన్నారు.