28.7 C
Hyderabad
May 5, 2024 09: 25 AM
Slider విజయనగరం

ఈ నెల 27 న భార‌త్ బంద్ కు సీపీఎం సంపూర్ణ మ‌ద్ద‌తు..!

#cpmvijayanagaram

దేశ వ్యాప్తంగా ఈ నెల 27 భార‌త్ బంద్ కు  కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన నేప‌ద్యంలో వామ‌ప‌క్ష పార్టీలు కూడా తమ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేసారు.

అందులో బాగంగా సీపీఎం కూడా త‌న మ‌ద్ద‌తును ప్ర‌కటించింది. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రుంలోని లావు గంగాద‌ర్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియాస‌మావేశంలో ఆ పార్టీ జిల్లా కార్య‌ద‌ర్శి త‌మ్మినేని సూర్య‌నారాయ‌ణ ,న‌గ‌ర అధ్య‌క్షుడు రెడ్డి శంక‌ర‌రావులు మాట్లాడారు.

మోడీ ప్ర‌భుత్వం కార్పొరేట్ కంపెనీల‌కు త‌లొగ్గే…రైతు కు వ్య‌తిరేకంగా చ‌ట్టాల‌ను తీసుకొచ్చింద‌న్నారు…సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి సూర్య‌నారాయ‌ణ‌. ఈ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ  గ‌డ‌చిన 9 నెల‌ల నుంచీ ఢిల్లీలో రైతులు ధ‌ర్నాలు చేస్తున్నా మోడీ ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు అయినా లేదని విమ‌ర్శించారు.

స‌హ‌నం న‌శించే కిశాన్ మోర్చా..ఈ నెల 27 భార‌త్ బంద్ న‌కు పిలుపు నిచ్చింద‌న్నారు. ఈ బంద్ కు వామ‌ప‌క్ష పార్టీలు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ ప్ర‌త్య‌క్షంగా బంద్ లో పాల్గొంటుంద‌న్నారు.

Related posts

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

Satyam NEWS

E-KYC పై పుకార్లు: ఆధార్ కేంద్రాల వద్ద తొక్కిసలాట

Satyam NEWS

ప్రధాన పర్యటన లో నిరసనకారులు ఘటనలో కాంగ్రెస్ కుట్ర

Satyam NEWS

Leave a Comment