రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష ప్రారంభం అయింది. కన్నా దీక్షలో రాజధాని రైతులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. ఆయన మౌన దీక్ష గంట పాట కొనసాగనున్నది. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో కన్నా మౌన దీక్షకు పూనుకున్నారు. రాజధాని శంకుస్థాపన పవిత్ర మట్టి కి పూజలు చేసిన ప్రదేశంలో ఆయన దీక్ష చేస్తున్నారు.