కడప జిల్లా రాజంపేటలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ కార్గ్ కి వినతపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా బిజెపి రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని గత కొద్ది రోజులుగా హిందువులపై హిందూ ఆలయాల పైనా దేవీ దేవతలపైన బిజెపి అగ్ర నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని అన్నారు.
అందువల్ల అతనిని రాష్ట్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బిజెపి డిమాండ్ చేశారు. అలాగే వారు హిందూ సమాజానికి మొత్తానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు పి నాగేశ్వరరావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వై సురేష్ రాజు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పట్టుపోగుల ఆదినారాయణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజేంద్ర బాబు,
బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి హరిప్రసాద్, మండల అధ్యక్షులు డి ప్రభావతి, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు పి పాపయ్య, మండల ప్రధాన కార్యదర్శులు రాము, ప్రసాద రాజు,
మండల ఉపాధ్యక్షులు నరసింహరాజు, బీజేవైయం రాష్ట్ర కార్యదర్శి గుణవర్మ, బిజెపి మహిళా నాయకురాలు సుభద్ర, బిజెపి ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు బాలరాజు శివరాజు, గురూజీ వర్మ, రైల్వే కోడూరు బిజెపి నాయకులు చెంగల్రెడ్డి, కె శ్రీనివాసులు, సుబ్బారావు , చలపతి, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు