రైతు బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ రైతు సంఘాల పిలుపు మేరకు ధర్నా నిర్వహించాలని అఖిలపక్ష పార్టీలు తీర్మానించాయి.
శుక్రవారం నాడు గాంధీ పార్క్ సెంటర్ నుండి 10 గంటలకు బైక్ ర్యాలీతో ఇందిరా చేరుకొని, సెంటర్లో ధర్నా నిర్వహించాలని, అనంతరం ఆర్ డి ఓ కి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేడు సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కంబాల శ్రీనివాస్, హుజుర్ నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, సిపిఎం పట్టణ కార్యదర్శి నాగారం పాండు, సిపిఎం పట్టణ కార్యదర్శి. గుండు వెంకటేశ్వర్లు,
తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు తండు సాయి రామ్ గౌడ్,దుగ్గి బ్రహ్మం, రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్, మామిడి నర్సయ్య, జక్కుల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.