28.7 C
Hyderabad
May 6, 2024 10: 18 AM
Slider ఆదిలాబాద్

ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ ధర్నా

#BJP Sirpur

ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు JB పౌడల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం ఉద్యోగులకు తెరాస ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచినా ఉద్యోగులకు PRC, DA, IR లను ఇంప్లిమెంటేషన్ విషయంలో  విఫలమైందని వారు తెలిపారు.

వెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే రైతులు పండించిన సన్న వడ్లకు 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని కోరారు.

కొమరం భీమ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన  ధర్నా కార్యక్రమంలో  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ZP చేర్మెన్ సిడం గణపతి, బీజేపీ జిల్లా నాయకులు సిర్పూర్ నియోజకవర్గ మండల అధ్యక్షులు సోయం చిన్నాన్న, ధోని శ్రీశైలం వసంత్  వివిధ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు

Bhavani

సీఎం జగన్ కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారి ప్రతినిధులు

Satyam NEWS

విజయనగరంలో పోలీసులు అమరవీరుల సంస్మరణ ముగింపు

Satyam NEWS

Leave a Comment