కానిస్టేబుల్స్ బదిలీల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.
నల్లగొండ జిల్లాలో దీర్ఘకాలంగా ఆయా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
కౌన్సిలింగ్ విధానం ద్వారా కానిస్టేబుల్స్ వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయడం ద్వారా మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నిర్దేశించిన ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని రంగనాధ్ వివరించారు.
కౌన్సిలింగ్ ప్రక్రియలో అదనపు ఎస్పీ నర్మద, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్ అతుఖుర్ రెహమాన్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య తదితరులున్నారు.